బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (08:19 IST)

డ్రా చేసుకునే మ్యాచ్‌ను చేజేతులా అప్పగించారు : సచిన్ టెండూల్కర్

ఇంగ్లండ్‌లోని సౌతాంఫ్టన్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ పోటీలో న్యూజిలాండ్ చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. నిజానికి డ్రా కావాల్సిన మ్యాచ్‌ను భారత్ చేజేతులా కోల్పోయింది. ఈ ఓటమిని ప్రతి ఒక్క భారత సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేక పోతున్నాడు. అలాంటి వారిలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఒకరు. 
 
కేవలం పది బంతుల తేడాతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కీలక బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా అవుట్ కావడం టీమిండియా అవకాశాలను దారుణంగా దెబ్బతీసిందని సచిన్ అభిప్రాయపడ్డాడు. వారిద్దరూ క్రీజులో ఎక్కువ సేపు ఉండుంటే ఆట మరోలా ఉండేదని, కనీసం భారత్ డ్రా చేసుకునేందుకు అవకాశాలు ఉండేవని వివరించాడు. 
 
టీమిండియా ఓటమికి పరోక్షంగా ఈ ఇద్దరి వైఫల్యమే కారణమని సచిన్ తెలిపాడు. ఆటకు చివరి రోజున తొలి సెషన్ ఎంతో కీలకమని తాను ముందే చెప్పానని అన్నాడు. కోహ్లీ, పుజారా వెంటవెంటనే అవుట్ కావడంతో జట్టు ఒత్తిడికి గురైందని, ఆపై వరుసగా వికెట్లు కోల్పోయిందని ఈ బ్యాటింగ్ మ్యాస్ట్రో విశ్లేషించాడు.