శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (13:32 IST)

కోహ్లీ సెల్ఫీలో అనుష్క మిస్సింగ్.. ఎక్కడుందంటే.. జిమ్‌లో?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథ్యం వహించిన విరాట్ కోహ్లీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తూ సెల్ఫీ దిగాడు. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అయితే, ఆ ఫొటోలో

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథ్యం వహించిన విరాట్ కోహ్లీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తూ సెల్ఫీ దిగాడు. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అయితే, ఆ ఫొటోలో కోహ్లీ భార్య, సినీనటి అనుష్క శర్మ లేదు. అందులో కోహ్లీ తల్లి, సోదరి, ఆమె పిల్లలు ఉన్నారు. దీంతో కోహ్లీ ఫోటోలో అనుష్క మిస్సింగ్ అంటూ పోస్టులు పెట్టారు. అనుష్క ఎక్కడ అంటూ ప్రశ్నాస్త్రాలు గుప్పించారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా, అనుష్క శర్మతో కలిసి జిమ్‌లో వ్యాయామం చేస్తూ సెల్ఫీ వీడియోను తీసుకున్న కోహ్లీ.. తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి అభిమానులను ఖుషీ చేశాడు. తన సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో మరో ట్రైనింగ్‌ సెషన్‌లో పాల్గొన్నానని పేర్కొన్నాడు. తనతో పాటు ఎవరు ఉన్నారో చూడండంటూ అనుష్క శర్మను చూపిస్తూ అలరించాడు. తన భార్య తన కంటే ఎక్కువగా వ్యాయామం చేస్తోందని, ఆమె స్ట్రాంగ్‌ అని తెలిపాడు. 

ఇదిలా ఉంటే.. జూన్‌లో టీమిండియా ఇంగ్లండ్ టూరుకు కోహ్లీ దూరమయ్యాడు. మెడ గాయం కారణంగా ఈ పర్యటన నుంచి కోహ్లీ తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. జూన్ 15వ తేదీన బెంగళూరులో జరిగే ఫిట్‌నెస్ టెస్టులో కోహ్లీ పాల్గొనాల్సి వుంది.