ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (11:03 IST)

మరో వివాదంలో హార్దిక్ పాండ్యా... గ్యాంగ్‌స్టర్ భార్య అత్యాచార ఆరోపణలు

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ముంబైకి చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ భార్య అతనిపై అత్యాచార ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. 
 
అండర్‌ వరల్డ్‌ మాఫియా డాన్‌ దావూద్ ఇబ్రహీం సహాయకుడు రియాజ్ భాటి భార్య రెహ్నుమా భాటి.. హార్ధిక్ పాండ్యాతో పాటు మునాఫ్ పటేల్, పృథ్వీరాజ్‌ కొఠారీ, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాలపై సంచలన ఆరోపణలు చేసింది. సదరు వ్యక్తులంతా తనను లైంగిక వేధింపులకు గురి చేసి, అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబైలోని సాంతా క్రూజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
తన భర్త రియాజ్ భాటి స్వప్రయోజనాల కోసం అతని వ్యాపార భాగస్వామ్యులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసేవాడని, అలా కొందరు హై ప్రొఫైల్ సెలబ్రిటీల వద్దకు తనను పంపేవాడని రెహ్నుమా తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, రెహ్నుమా ఇచ్చిన ఫిర్యాదులో సరైన అడ్రస్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
 
ప్రస్తుతం ఈ ఫిర్యాదుకి సంబంధించిన పేపర్లు నెట్టింట వైరల్‌గా మారింది. సెప్టెంబర్‌లో కేసు పెట్టినా పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, తనకు జరిగిన అన్యాయంపై పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదని రెహ్నామా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ కేసు వివరాలను వెల్లడించడానికి ముంబై పోలీస్ అధికారులు నిరాకరించారు. విచారణ జరుగుతుందని, ఇప్పుడేం చెప్పలేమన్నారు.