శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 ఆగస్టు 2022 (09:46 IST)

పల్నాడు రొంపిచర్లలో వృద్ధురాలిపై అత్యాచారం

murder
ఉమ్మడు గుంటూరు జిల్లాలోని పల్నాడు సమీపంలోని రొంపిచర్ల మండలంలో ఓ వృద్ధురాలిపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత బాధితురాలిని హత్య చేశాడు. విప్పర్లలో ఆరు బయట నిద్రిస్తుండగా ఈ దారుణం జరిగింది. అయితే, ఈ దారుణానికి పాల్పడిన కామాంధుడుని పోలీసు జాగిలాలు గుర్తించాయి.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రొంపిచర్ల మండలంలోని విప్పర్లకు చెందిన 65 యేళ్ల వృద్ధురాలు రోజులానే శుక్రవారం రాత్రి ఇంటిముందు ఆరుబయట నిద్రించింది. శనివారం ఉదయం పొద్దెక్కినా లేవకపోవడంతో వెళ్లి లేపేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె శరీరంపై గాయాలు ఉండడంతోపాటు దుస్తులు తొలగించి ఉండడంతో అత్యాచారం చేసి హత్య జరిగినట్టు అనుమానించారు. దీంతో పోలీస్ జాగిలాలతో తనిఖీ చేయించారు. 
 
శునకాలు అక్కడికి సమీపంలోనే ఉన్న పెరవలి మణికంఠ (27) ఇంట్లోకి వెళ్లడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తానే ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.