శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2024 (10:02 IST)

ఆర్థిక మోసం కేసులో పద్మశ్రీ అవార్డు గ్రహీత అరెస్టు!! దేశ చరిత్రలోనే తొలిసారి!!

arrest
ఆర్థిక మోసం కేసులో పద్మశ్రీ అవార్డు గ్రహీత సుందర్ సీ మీనన్‌ను పోలీులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు కోర్టు రిమాండ్ కూడా విధించింది. దీంతో ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతను పోలీసులు జైలుకు తరలించారు. మోసం కేసులో ఆయనపై మొత్తం 18 సెక్షన్ల కింద ఓ కేరళకు చెందిన ఓ వ్యాపార వేత్తను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 
 
సాధారణంగా వ్యాపారవేత్తలు కొందరు ఆర్థక నేరాల కేసుల్లో అరెస్టు అవ్వడం, ఆ తర్వాత బెయిల్ పై విడుదల కావడం పెద్ద విషయమేమీ కాదు. కానీ కేరళకు చెందిన ఈ వ్యాపారవేత్త ఆర్ధిక మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కోవడం, కోర్డు రిమాండ్ విధించడం హాట్ టాపిక్ అయ్యింది. అదీ ఎందుకు అంటే .. అరెస్టు అయిన వ్యాపారవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత కావడం. 2016లో పద్మశ్రీ అవార్డు అందుకున్న వ్యాపార వేత్త సుందర్ సీ మీనన్ పలు సంస్థలకు డైరెక్టర్‌గా వ్యహరిస్తుంటారు.
 
అయితే సుందర్ సీ మీనన్, మరి కొందరు తమ సంస్థల పేరుపై 62 మందికిపైగా ఇన్వెస్టర్‌ల నుంచి రూ.7.78 కోట్ల డిపాజిట్లు తీసుకుని, స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి తర్వాత డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై వివిధ సెక్షన్‌ల కింద 18 కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. కేరళ క్రైమ్ బ్రాంచ్ అధికారులు కేసు దర్యాప్తు క్రమంలో భాగంగా సుందర్ సీ మీనన్‌ను అరెస్టు చేశారు.