ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 నవంబరు 2021 (14:38 IST)

కుమార్తెను గర్భవతిని చేసిన తండ్రి... ఎక్కడ?

ఇటీవలి కాలంలో వావివరసలు మంటకలిసిపోతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే పశువుగా మారిపోయి కన్నబిడ్డల శీలాన్ని కాటేస్తున్నాడు. తాజాగా ఓ కన్నతండ్రి కామంతో కళ్ళుమూసుకుని కుమార్తెను గర్భవతిని చేశాడు. ఈ విషయం బయటకు చెప్తే అందర్నీ చంపేస్తానని బెదిరించాడు. ఈ దారుణం మోమిన్ పేటలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని మోమిన్ పేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి ముగ్గురు పిల్లలు. వీరిని మోమిన్ పేటలో చదివిస్తూ భార్యత కలిసి పటాన్ చెరువులోని ఆ ఫాంహౌజ్‌లో పని చేస్తున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్డౌన్ అమలు చేయడంతో స్కూల్స్ మూసివేశారు. దీంతో ముగ్గురు పిల్లలను తమ వద్దకు తీసుకెళ్లారు. 
 
ఈ క్రమంలో 8వ తరగతి చదువుతున్న పెద్ద కుమార్తెపై కామాంధ తండ్రికి కన్నుపడింది. అంతే ఇంట్లో భార్య లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత పలు మార్లు అదేవిధంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ యువతి అనారోగ్యానికి గురైంది. దీంతో ఆస్పత్రి తీసుకెళ్లిన తల్లికి వైద్యులు చెప్పిన మాట విని గుండె ఆగిపోయినంత పని అయింది. 
 
ఇంటికి వెళ్ళి కుమార్తెను నిలదీయగా అసలు విషయం చెప్పింది. ఇదే విషయంపై భర్తను నిలదీయగా ఈ విషయం బయటకు చెబితే అందర్నీ చంపేస్తానని హెచ్చరించాడు. పైగా, గర్భస్రావం చేయించాలని రూ.20 వేల నగదు ఇచ్చాడు. దీంతో దిక్కుతోచని ఆ తల్లి.. కుమార్తెను వెంటబెట్టుకుని పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికెళ్లి అబార్షన్ చేయాలని వైద్యులను ప్రాధేయపడింది. 
 
కానీ, వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి బాధితురాలి వద్ద విచారణ జరపి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.