1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (11:06 IST)

స్కూలుకెళ్లిన బాలుడుని లాడ్జీకి లాక్కెళ్లి యువతి అత్యాచారం.. ఎక్కడ?

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. స్కూలుకెళ్లిన బాలుడిని ఓ యువతి బలవంతంగా లాడ్జీకి తీసుకెళ్లిన ఓ యువతి అత్యాచారానికి పాల్పడింది. ఆ తర్వాత మూడుసార్లు బెదిరించి అతని వద్ద నుంచి ఏకంగా రూ.16 లక్షల వరకు వసూలు చేసింది. ఈ ఘటన మూడేళ్ల క్రితం జరిగినట్టుగా భావిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని టోలీచౌకీలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. ఇటీవల జూబ్లీహిల్స్‌కు మారింది. ఈ క్రమంలో బీరువాలో ఉండాల్సిన రూ.20 వేల నగదుతో పాటు బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో 9వ తరగతి చదువుకుంటున్న తన కుమారుడిని తల్లి నిలదీయగా, అతను చెప్పిన విషయం విని ఆ తల్లి నిర్ఘాంతపోయింది. 
 
డబ్బుతో పాటు.. బంగారాన్ని బెంగుళూరులో ఉండ్రి తండ్రి బంధువైన యువతికి ఇచ్చినట్టు చెప్పాడు. ఆ తర్వాత అస్సలు ఎందుకు ఇలా చేశావని నిలదీయడంతో అసలు విషయాన్ని పూసగుచ్చినట్టు వివవరించారు. 
 
ఒక రోజున తాను చదువుకుంటున్న స్కూలుకు వచ్చిన తనను బలవంతంగా లాడ్జీకి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేసిందని బోరున విలపిస్తూ చెప్పింది. పైగా, ఆ అఘాయిత్యాన్ని వీడియో తీసిపెట్టుకుని, దాన్ని చూపిస్తూ పలుమార్లు డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడున్నట్టు చెప్పింది. ఆ విధంగా మూడుసార్లు చేసిందని చెప్పింది. 
 
దీంతో తాను భయపడి మరో మార్గంలేక ఇంట్లోని బంగారం, డబ్బులను చోరీ చేసినట్టు చెప్పారు. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టగా, ఈ ఘటన మూడేళ్ళ క్రితం జరిగినట్టు నిర్థారించి, ఆ యువతిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.