1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: సోమవారం, 18 అక్టోబరు 2021 (19:12 IST)

పక్కనే పిల్లలున్నారని కూడా చూడకుండా ప్రియుడి కోసం భర్తను అలా చేసింది

వివాహేతర సంబంధం నిండు జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామం. రామయ్య- జయలక్ష్మి ఇద్దరు భార్యాభర్తలు. పెళ్లయి కూతురు, కుమారుడు కూడా ఉన్నారు. పిల్లాపాపలతో వారి జీవితం సుఖంగా సాగుతోంది.
 
కొన్నాళ్ల పాటు సంతోషంగా గడిపిన వీరి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. అయితే రామయ్య భార్య జయలక్ష్మి రెండేళ్ల నుంచి అదే గ్రామానికి చెందిన మహ్మద్ కైజర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తకు తెలియకుండా బయటి సుఖానికి అలవాటు పడింది. అలా సమయం దొరికినప్పుడల్లా కైజర్‌తో ఆ మహిళ గడుపుతోంది.
 
కొన్నాళ్లకు ఈ విషయం కాస్తా భర్త రామయ్యకు తెలిసింది. భార్యను మందలించే ప్రయత్నం చేశాడు. దీంతో బుద్ది మార్చుకోని జయలక్ష్మి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపాలని భావించింది. నిద్రిస్తున్న భర్త గొంతుకి టవల్ బిగించి హత్య చేసింది.
 
ఈ ఘోరాన్ని కూతురు, కుమారుడు కళ్లారా చూసి బంధువులకు తెలిపారు. ఇక హత్య అనంతరం ప్రియుడి సాయంతో భర్త శవాన్ని హంద్రీనీవా కాలువలో పడేసింది. ఇంతటితో ఆగకుండా భర్త కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ప్లాన్ వేసిన ప్రియుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.