సంబంధిత వార్తలు
- భర్తను వదిలేసి పరాయి పురుషుడితో అక్రమ సంబంధం.. ఆపై ఆర్టీసీ డ్రైవరుపై మోజు.. చివరకు..
- చనిపోయిన అభిమానుల ఇంటికి సన్నిహితులను పంపిన రామ్ చరణ్ - 10 లక్షల ఆర్థిక సాయం
- గంజాయి బ్యాచ్ బీభత్సం.. ఏకంగా పోలీసులపైకే కారు ఎక్కించిన వైనం...(Video)
- ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతి.. పవన్ కల్యాణ్ ఆదేశాలు
- Pawan Kalyan: బిగ్ సి బాలు కుమార్తె నిశ్చితార్థ వేడుక.. హాజరైన పవన్ దంపతులు (video)
రంగరాయ వైద్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య.. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవుతాడనుకుంటే?
ఏపీలోని రంగరాయ మెడికల్ కాలేజీలో సోమవారం రాత్రి విషాదకరమైన సంఘటన జరిగింది. 22 ఏళ్ల ఎంబిబిఎస్ విద్యార్థి రావూర్ సాయిరామ్ తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ సంఘటన తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో జరిగింది. రెండవ సంవత్సరం వైద్య విద్యార్థి అయిన సాయిరామ్ తన గదిలోకి తాళం వేసుకున్నట్లు తెలిసింది. చాలాసేపటికి బయటికి రాకపోవడంతో తోటి విద్యార్థులు ఆందోళన చెంది బలవంతంగా తలుపు తెరిచి చూడగా అతను సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు.
హాస్టల్ సిబ్బందికి, సాయిరామ్ తండ్రికి విషయాన్ని తెలియజేశారు. ఇంకా స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కానీ మార్గమధ్యలోనే సాయిరామ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
