1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జూన్ 2022 (13:26 IST)

సికింద్రాబాద్ కార్ఖానాలో మరో బాలికపై అత్యాచారం

victim
తెలంగాణ రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే జూబ్లీహిల్స్‌లోని ఆమ్నేషియా క్లబ్ వద్ద కారులో ఓ మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది మరిచిపోక ముందే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పుట్టిన రోజు వేడుకల పేరుతో ఓ బాలికను తీసుకెళ్లి కారులోనే అత్యాచారం చేశారు. 
 
ఇపుడు సికింద్రాబాద్‌ పరిధిలో మైనర్‌ బాలికపై జరిగిన సామూహిక అత్యచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్ఖానా పరిధిలో బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. 
 
బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్న నిందితులు ధీరజ్‌, రితేశ్‌ బాలికకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నారు. అత్యాచారం చేసిన సమయంలో వీడియోలు తీసి ధీరజ్‌, రితేశ్‌ బాలికను భయపెట్టారు. వీడియోలు ఇస్తానని చెప్పి పిలిచి ఇతర స్నేహితులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ ఘటన దాదాపు రెండు నెలల క్రితం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక పరిస్థితి చూసి ఆమె కుటుంబసభ్యులు మానసిక నిపుణుడి దగ్గరికి తీసుకెళ్లారు. మానసిక నిపుణుడి వద్ద బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు మే 30వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.