మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (08:53 IST)

టీచర్ సుజాత - రాజేశ్ మృతికి కారణాలు ఇవే.. వెల్లడించిన పోలీసులు

suicide
హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్‌లో టీచర్ సుజాత - రాజేశ్ మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. అసలు రాజేశ్, టీచర్ సుజాతల మధ్య ఏం జరిగింది, వారిద్దరూ ఆత్మహత్య చేసుకోవాడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అన్నది సేకరించారు. పైగా, ఈ కేసు దర్యాప్తు కూడా ఓ కొలిక్కి వచ్చింది. 
 
వీరిద్దరి మధ్య యేడాదిన్నర క్రితం ఓ మిస్డ్ కాల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ నెల 24వ తేదీన వారిద్దరూ చివరిసారిగా కలుసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నారు. పైగా, పురుగుల మందు సేవించి చనిపోవాలని అనుకున్నారు.
 
ఇందుకోసం టీచర్ పేరుమీద హయత్ నగరులోని ఓ షాపులో పురుగుల మందు డబ్బా కొనుగోలు చేశారు. గత నెల 24వ తేదీన ఇంటికి వెళ్లాక టీచర్ పురుగుల మందు తాగింది. అదే రోజు రాజేశ్ కూడా పురుగుల మందు సేవిచంచాడు. 
 
టీచర్‌ సుజాతను భర్త నాగేశ్వర రావు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె రెండు రోజుల తర్వాత  కన్నుమూసింది. రాజేశ్ కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారిద్దరూ ఫోన్లలో ఉన్న పూర్తి వివరాలతో పోలీసులు ఈ కేసును ఛేదించారు. 
 
ఒక రాంగ్ ఫోన్ కాల్.. ఇద్దరి ప్రాణాలు తీసింది.. ఎలా?
ఒక రాంగ్ ఫోన్ కాల్ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్‌లో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన రాజేశ్ అనే యువకుడు ఇటీవల మృతి చెందాడు. దీనిపై పోలీసులు ఆరా తీయగా కొత్త కోణాలు వెలుగు చూశాయి. ఆరు నెలల క్రితం సుజాత అనే టీచర్ ఫోన్ నుంచి రాజేశ్‌కు ఓ రాంగ్ ఫోన్ కాల్ వచ్చింది. అప్పటి నుంచి వారి మధ్య పరిచయం ప్రారంభమైంది. సుజాత్ ఫోన్ డీపీ చూసిన రాజేశ్‌.. సుజాతకు పెళ్లి కాలేదని భావించి, ఆమెను ప్రేమించసాగాడు. పైగా, పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాట్సాప్ మెసేజ్ సందేశాలు, ఫోన్ సంభాషణలు బాగానే జరిగాయి. 
 
నిజానికి టీచర్ సుజాతకు వివాహమై ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంది. ఈ విషయాన్ని దాచిపెట్టిన సుజాత... రాజేశ్‌‍తో కలిసి అనేక ప్రాంతాల్లో విహరించింది. వారిద్దరూ కలిసి పలుమార్లు ఏకాంతంగా కలుసుకున్నారు. అలా కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత సుజాతకు వివాహం జరిగిందన్న విషయం తెలుసుకుని ఆమెపై రాజేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమెను దూరం పెట్టసాగాడు. రాజేశ్ తనను దూరం పెట్టడాన్ని సుజాత జీర్ణించుకోలేక పోయింది. అయితే, ఓ సారి కలుద్దాం రమ్మంటూ సుజాత అతనికి మెసేజ్ పెట్టింది. రాజేశ్ స్పందించకపోవడంతో తాను చనిపోతానని బెదిరించింది. నువ్వు చనిపోతే తాను కూడా చనిపోతానంటూ రాజేశ్ రిప్లై ఇచ్చాడు. 
 
ఈ క్రమంలో సుజాతను కలుసుకునేందుకు రాజేశ్ హయత్ నగర్‌కు వచ్చాడు. అప్పటికే సుజాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పైగా, ఈ విషయం సుజాత కుమారుడు, కుమార్తెకు తెలిసింది. రాజేశ్ రాగానే సుజాత కుమారుడు మరో ముగ్గురితో కలిసి దాడి చేశాడు. ఆ తర్వాత రాజేశ్ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మాత్రం.. దాడి చేయడం వల్లే రాజేశ్ చనిపోయివుంటాడన్న కోణంలో విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మొత్తంమీద ఓ మిస్డ్ ఫోన్ కాల్ ఇద్దరి ప్రాణాలు తీసింది.