శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (08:12 IST)

వివాహితపై అత్యాచారం.. కామవాంఛ తీరాక పుస్తెల తాడు తెంచుకుని పారిపోయారు...

victim
హైదరాబాద్ నగరంలో ఓ వివాహితపై ఇద్దరు దుండగులు అత్యాచానికి పాల్పడ్డారు. తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడును తెంచుకుని పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వికారాబాద్ జిల్లాకు చెందిన దంపతులు గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీరం చెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. 29 యేళ్ల వివాహిత గేటెడ్ కమ్యూనిటీలో పనిచేస్తుంది. ఆమె శుక్రవారం తన పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా, ఓ వ్యక్తి ఆమెను వెంబడించాడు. తమ వద్ద పని వుందని నమ్మించి ఆమె ఫోను నంబరు తీసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున ఆమెకు ఫోన్ చేసి పని చేసి మాట్లాడాడు. 
 
అదేరోజు రోజు ఉదయం పనికి వెళుతుంటే కారు డ్రైవర్ శుభం శర్మ (29), ప్రైవేటు ఉద్యోగి సుమిత్ కుమార్ శర్మ (33)లతో కలిసి ఆమెను అనుసరించారు. మంచి పని ఇప్పిస్తామని చెబుతూనే ఆమె మెడపై కత్తి పెట్టి బలవంతంగా కారులో ఎక్కించి కిడ్నాప్ చేశారు. అరిస్తే చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత మత్తుమందు కలిపిన పానీయాన్ని బలవంతంగా తాగించారు. దీంతో ఆమె సృహ కోల్పోయింది. 
 
కారును ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును తెంచుకుని పారిపోయారు. తమ కామవాంఛ తీరిన తర్వాత గండిపేట సమీపంలో వదిలి వెళ్లారు. స్పృహలోకి వచ్చిన తర్వాత  ఆమె తన భర్తకు, మేనమామకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. వారంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నార్సింగి పోలీసులు కేసు నమోదుచేసి మొబైల్ నంబరు ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన కారు, మొబైల్ ఫోనును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.