గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (14:38 IST)

ఈ కాలుష్యంతో మధుమేహం ముప్పు..?

నేటి తరుణంలో చాలామంది డయాబెటిస్ వ్యాధి కారణంగా పలురకాల సమస్యలు ఎదుర్కుంటున్నారు. అందుకోసం ఎలాంటి మందులు వాడినా, వైద్యచికిత్సలు చేయించుకున్నా ఫలితం కనిపించలేదు. మధుమేహ వ్యాధి ఒక్కసారి వచ్చిదంటే చాలు.. అసలు పోనే పోదు. అందుకు ముఖ్య కారణం వాయు కాలుష్యం కూడా..
 
ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మధుమేహ వ్యాధికి దారితీస్తాయి. గాలిలోని సూక్ష్మ కాలుష్య కణాలు, దుమ్ముధూళి శరీరంలోనికి ప్రవేశించడం ద్వారా రక్తంలో చెడు పదార్థాలు ఎక్కువగా చేరుతాయి. దాంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు వైద్యులు. 
 
అయితే ఈ కాలుష్య కణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించి, మంట, వాపులకు కారణమవుతున్నట్లు తెలిసింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన కొత్త మధుమేహ వ్యాధుల్లో కనీసం 14 శాతం మంది అంటే 32 మంది వాయు కాలుష్యం కారణంగా ఈ వ్యాధి బారిన పడినట్లు పేర్కొన్నారు. కాలుష్యాన్ని మధుమేహ వ్యాధి కారణంగా గుర్తిస్తే.. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.