1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 26 జనవరి 2022 (20:53 IST)

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకుంటే అనారోగ్యం, ఏంటవి?

భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం చాలామందికి అలవాటు. కానీ ఈ అలవాటు శరీరానికి చాలా ప్రమాదకరం. ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది.


కాబట్టి శాశ్వత పిత్తం వంటి సమస్యలు రావచ్చు. వైద్యు నిపుణుల అభిప్రాయం ప్రకారం, భోజనానికి ఒక గంట ముందు, భోజనం తర్వాత ఒక గంట తర్వాత కాఫీ లేదా టీకి దూరంగా ఉండాలి. భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరంలో ఐరన్ తగ్గుతుంది. ఇది అలసట, బలహీనత వంటి వివిధ సమస్యలకు దారి తీస్తుంది.

 
అలాగే భోజనం చేసిన వెంటనే మద్యం తాగే అలవాటు కొంతమందికి వుంటుంది. అది శరీరానికి చాలా హానికరం. ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది వివిధ ప్రేగు సంబంధిత వ్యాధులకు కూడా కారణమవుతుంది. అందువల్ల, భోజనానికి ముందు లేదా తర్వాత కనీసం అరగంట పాటు మద్యం సేవించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

 
మరికొందరు భోజనం తిన్న వెంటనే సిగరెట్ తాగుతుంటారు. ఇలాంటి అలవాటు వున్నవారు తక్షణమే దాన్ని మానుకోవాలి. భోజనం చేసిన వెంటనే సిగరెట్ తాగడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంది. ఇది కడుపులో అల్సర్‌లకు దారితీస్తుంది.

 
భోజనం చేసిన తర్వాత కొంతమంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. భోజనం చేసిన వెంటనే చల్లటి నీటిని తాగడం వల్ల ఆహారం జీర్ణం కాదు. ఇది జీర్ణ శక్తిని కూడా తగ్గిస్తుంది.