శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (16:46 IST)

డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? పార్కులో అలా పది నిమిషాలు?

ఈ ఆధునిక ప్రపంచంలో మానవులు తన కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. అందువల్ల నిత్యం ఒత్తిడికి గురవుతున్నారు. మానసిక సమస్యలు, డిప్రెషన్, ఆందోళన వంటి రుగ్మతలతో సతమతమవుతున్నారు. 
 
ఇందుకోసం మానసిక వైద్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు. అయితే ఇలా కాకుండా ఒత్తడిని తగ్గించుకోవడానికి నిత్యం 20 నిమిషాల పాటు పచ్చని ప్రకృతిలో అలా తిరిగి రావడం వల్ల ఒత్తడి మటుమాయం అవుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 
 
రోజూ 20 నిమిషాల పాటు పచ్చని ప్రకృతిలో గడిపితే ఒత్తడి అంతా దూరమవుతుందట. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ అలబామాకు చెందిన సైంటిస్టులు నిత్యం పార్కులకు వెళ్లే 100 మందిపై అధ్యయనం చేశారు. వారిలో ఏవైనా మానసిక సమస్యలు ఉన్నాయని ప్రశ్నించారు, అలాగే సంతృప్తిక‌ర‌మైన జీవితం వంటి అంశాల‌పై శాస్త్రవేత్తలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. 
 
ఫలితంగా వారికి ఈ విషయం అర్థమైందట. అదే నిత్యం 20 నిమిషాల పాటు ప‌చ్చ‌ని ఆహ్లాద‌క‌ర‌మైన ప్ర‌కృతి వాతావ‌ర‌ణంలో గ‌డిపే వారికి ఒత్తిడి అస‌లు ఉండ‌ద‌ట‌. దీనికి తోడు డిప్రెష‌న్‌, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా పోతాయ‌ని వారు చెబుతున్నారు. 
 
అయితే సిటీల్లో అలాంటి వాతావ‌ర‌ణం ఉండ‌దు క‌దా అనే వారు.. త‌మ‌కు స‌మీపంలో ఉన్న పార్కుల‌కు వెళ్లి కొంత సమయం గ‌డిపితే చాలు.. మాన‌సిక స‌మస్య‌ల నుంచి బ‌య‌టప‌డ‌వ‌చ్చు. ఒత్తిడి త‌గ్గుతుంది. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా ఒత్తడి బారిన పడితే అలా ఓ 20 నిమిషాలు ఏదైనా పార్కులో తిరిగి రండి. ఒత్తడి మటుమాయం అవుతుంది.