తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రం మంత్రి పీయూష్
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం కాలినడక తన కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన తిరుమలకు విచ్చేశారు.
శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం తర్వాత వేదపండితులు గోయల్ను ఆశీర్వదించారు. టీటీడీ జేఈవో శ్రీనివాస రాజు మంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.