మధుమేహం వున్నవారు ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే....  
                                       
                  
                  				  మధుమేహం వ్యాధి ఉన్నవారు ప్రతిరోజూ పరగడుపున వేపాకురసం కాస్త తీసుకుంటే షుగర్ తగ్గుతుంది. అలాగే నేరేడు చెక్కను కాల్చి ఆ పొడి భద్రపరచుకుని రోజూ పరగడుపున ఓ చెంచా ఒక గ్లాసు నీళ్లతో కలిపి తాగితే షుగరు తగ్గుతుంది.
				  											
																													
									  
	 
	లేత మునగాకుని కూరలా వండుకుని తింటే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. చిన్నపిల్లలకి రాత్రిళ్లు పక్కలో మూత్రం పోసే అలవాటు ఉంటే, ఈ కూర పెట్టడం మంచిది.
				  
	 
	రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంటే కరక్కాయ చూర్ణాన్ని ప్రతిరోజూ క్రమం తప్పక తేనెతో తీసుకోవడం మేలు.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	మునగచెట్టు వేరును బాగా దంచి రసం తీసి దానిలో తేనె కలిపి పాలతో తాగిస్తే వాతపు నొప్పులు తగ్గుతాయి.