1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. 1 dead, 22 injured in China eatery explosion

చైనాలో రెస్టారెంట్‌లో పేలుడు.. ఒకరు మృతి.. 22 మందికి గాయాలు

bomb blast
చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో బుధవారం జరిగిన ఈటెరీ పేలుడులో ఒకరు మృతి చెందగా, మరో 22 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. నగరంలోని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ బ్యూరో ప్రకారం, సాన్హే నగరంలోని యంజియావో టౌన్‌షిప్‌లోని ఫ్రైడ్ చికెన్ రెస్టారెంట్‌లో ఉదయం 7:54 గంటలకు పేలుడు సంభవించింది.
 
గ్యాస్ లీక్ కారణంగా ఇది సంభవించినట్లు అనుమానిస్తున్నట్లు బ్యూరో తెలిపింది. రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ పేలుడు ధాటికి అక్కడ ఉన్న చుట్టు పక్కల భవనాలతో పాటు వాహనాలు కూడా పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. 
 
ఆ పేలుడు సంభవించిన తర్వాత అక్కడ భారీ ఎత్తున్న నీలి మంటలు ఎగిసిపడినట్లు వైరల్ అవుతున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.