1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 నవంబరు 2021 (15:15 IST)

కార్గో ట్రక్కు బీభత్సం.. 19 మంది మృత్యువాత

మెక్సికో దేశంలో ఓ కార్గో ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఇందులో ఏకంగా 19 మంది వరకు మృత్యువాతపడ్డారు. అనేక మంది గాయపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సెంట్రల్ మెక్సికోలోని హైవే పై ఉన్న ఓ టోల్ బూత్ వ‌ద్ద శ‌నివారం ఓ వ‌స్తువుల‌ను ర‌వాణా చేసే కార్గో ట్ర‌క్కు అదుపు త‌ప్పి ప‌లు వాహ‌నాల‌పైకి దూసుకెళ్లింది. 
 
ఈ క్ర‌మంలో అక్క‌డ మంట‌లు చెల‌రేగి ప‌లు వాహ‌నాలు ద‌గ్థం అయ్యాయి. మంట‌ల్లో చిక్కుకుని 19 మంది స‌జీవ ద‌హ‌నమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ కార్గో ట్రక్కు బ్రేకులు ఫెయిలవడం కావ‌డం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాధ‌మిక నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.