మంగళవారం, 24 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 జూన్ 2025 (10:10 IST)

ఇరాన్-ఇజ్రాయేల్ దాడులు.. ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఏంటది?

air india
పశ్చిమాసియాలోని దేశాలు, ఉత్తర అమెరికాలోని తూర్పు తీరంలో ఉన్న పలు నగరాలు, యూరప్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఉత్తర అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరిన కొన్ని విమానాలను మళ్లీ వెనక్కి మళ్లించినట్లు ఎయిరిండియా తెలిపింది. 
 
అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టిన తరుణంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ ప్రాంతం నుంచి వెళ్లే తమ అన్ని విమాన సర్వీసులను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
 
భారత్ నుంచి బయలుదేరిన వాటిని ఇతర మార్గాల్లో తిరిగి వెనక్కి రప్పిస్తున్నట్లు పేర్కొంది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఎప్పటికప్పుడు తమ ప్రయాణికులకు అప్ డేట్స్ ఇస్తామని, వారి క్షేమం, భద్రతే తమ తొలి ప్రాధాన్యమని ఎయిరిండియా పేర్కొంది.
 
మరోవైపు పశ్చిమాసియాలో తీవ్రమైన ఉద్రిక్తపరిస్థితుల వేళ దుబాయి, దోహా, బహ్రెయిన్, దామమ్, అబుదాబీ, కువైట్ తిబ్లిసీ నుంచి రావాల్సిన, వెళ్లాల్సిన విమానాలు ఇండిగో విమానాలపై ప్రభావం పడింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఇండిగో పేర్కొంది.