అహ్మాదాబాద్ విమాన బాధిత కుటుంబాలకు టాటా చైర్మన్ సారీ
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు టాటా చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ క్షమాపణలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, ఈ ఘోర ప్రమాదంలో 275 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు హృదయ పూర్వక క్షమాపణలు తెలిపారు.
టాటా సంస్థ నడిపే విమానయాన సంస్థల్లో ఈ ప్రమాదం జరిగినందుకు తీవ్రంగా చింతిస్తున్నాను. ఈ సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. వారికి అవసరమైన సాయాన్ని అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉంది. ఈ ఘటనకుగాను బాధిత కుటుంబాలకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతానికి ఈ ఘటనపై ఎలాంటి నిర్ధారణ రాలేము. బ్లాక్ బాక్స్, ఇతర రికార్డర్ల ద్వారా ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయి. అప్పటివరకు వేచిచూడాలి అని చంద్రశేఖర్ అన్నారు.