శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (16:17 IST)

సోమాలియాలో ఉగ్రవాదుల ఘాతుకం.. వైద్యులను కిడ్నాప్ చేసి కాల్చేశారు..

సోమాలియాలో అల్‌ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్ షబాబ్‌కు చెందిన తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. తొమ్మిది మంది వైద్యులను ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు. మొదట తొమ్మిది మంది డాక్టర్లను కిడ్నాప్ చేసిన సౌత్ సోమాలియాకు చెందిన ఉగ్రవాదులు ఆ తర్వాత వారిని కాల్చి చంపేశారు. అనంతరం వైద్యుల మృతదేహాలను మిడిల్ షాబెల్లీ ప్రావిన్స్ ప్రాంతంలోని బలాద్ నగరంలో పడేసి వెళ్లారు. దీంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 
 
కాగా, వైద్యులందరూ యువకులేనని, స్థానిక ఆస్పత్రుల్లో పని చేస్తున్నజూనియర్ డాక్టర్లుగా అధికారులు పేర్కొన్నారు. షరియా చట్టం యొక్క తీవ్రమైన సంస్కరణను దేశంలో విధించే ప్రయత్నంలో దేశవ్యాప్తంగా అనేక దాడులు చేస్తున్న అల్-షాబాబ్ ఉగ్రవాదులు ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశారు. 1990 ప్రారంభంలో వంశ-ఆధారిత సాయుధ సమూహాల మధ్య అంతర్యుద్ధం చెలరేగినప్పటి నుండి సోమాలియా హింస జరుగుతూనే వుంది.