సంబంధిత వార్తలు
- వలస కార్మికులకు దేవుడు.. రైళ్లు, బస్సులు కాదు.. ఫ్లైట్ బుక్ చేశాడు..
- అత్తమ్మ కోసం అమెరికా వెళ్లాం.. త్వరలో భారత్కు వచ్చేస్తాం.. సన్నీ
- అంతర్జాతీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్!!?
- ఆ ముగ్గురి కోసం బోయింగ్ 747 విమానాలు - ఖజానాపై భారం రూ.8458 కోట్లు
- పది మంది రైతులకు రూ. 68,000తో విమాన టిక్కెట్లు కొనిచ్చిన రైతు
ఎగిరే విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..!
ఎగురుతున్న విమానంలో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మనీలాకు చెందిన ఓ మహిళ ముప్పై అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో మగబిడ్డను ప్రసవించింది.
వివరాల్లోకి వెళితే.. జూన్ 6న దుబాయ్ నుంచి మనీలాకు బయల్దేరిన ఫిలిప్పీన్స్ ఎయిర్ లైన్స్కు చెందిన పీఆర్659 విమానంలో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో విమాన సిబ్బంది ఈ విషయాన్ని ఎయిర్లైన్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు వెంటనే స్పందించి డాక్టర్ను సంప్రదించారు.
ఈ నేపథ్యంలో శాటిలైట్ ఫోన్ ద్వారా డాక్టర్ ఇచ్చిన సూచనల ప్రకారం విమానం సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి.. ఆ మహిళకు కాన్పు చేశారు. కాగా.. 30వేల అడుగుల ఎత్తులో పుట్టిన శిశువుకు స్వాగతం పలికిన విమాన సిబ్బంది.. ఆ క్షణాలను సెలబ్రేట్ చేసుకున్నారు. పుట్టిన శిశువుతో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
