శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (15:04 IST)

బలహీనపడిన వాయుగుండం - ఏపీలో వర్షాలు తగ్గుముఖం

rain
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమేపీ బలహీనపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పడుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణిస్తూ సోమవారం బలహీనపడి, అల్పపీడనం స్థాయికి పడిపోతుందని తెలిపారు. 
 
అయితే, అల్పపీడనం బలహీనపడినప్పటికీ సోమ, మంగళవారాల్లో మాత్రం అక్కడక్కడ వర్షపు జుల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావం కారణంగా తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. 
 
పైగా, సముద్రంలో అలజడి పూర్తిగా తగ్గిపోలేదని అందువల్ల జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని వారు హెచ్చరించారు. అయితే, ఈ వాయుగుండం ప్రభావం ఏపీలో పెద్దగా కనిపించలేదని చెప్పొచ్చు. ఒక్క పాలకోడేరులో మాత్రం 14 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదు కాగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షపు జల్లులు పడ్డాయి.