1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (11:14 IST)

శాడిస్ట్ భర్త.. పచ్చిమిరపకాయ ముక్కలను భార్య మర్మాంగంలో చొప్పించాడు...

నార్త్ ఈస్ట్ వియత్నాంలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను మోసం చేసి మరోవ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని ఆ భర్త.. తన భార్యకు తగినశాస్తి చేశాడు. తనను మోసం చేసి

నార్త్ ఈస్ట్ వియత్నాంలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను మోసం చేసి మరోవ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని ఆ భర్త.. తన భార్యకు తగినశాస్తి చేశాడు. తనను మోసం చేసిన భార్యకు జీవితాంతం గుర్తుండిపోయేలా గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుని ఓ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్‌లో భాగంగా భార్య మర్మాంగంలోకి పచ్చిమిరపకాయలను చొప్పించాడు. దీంతో మంట బాధను తట్టుకోలేక ఆ మహిళ కేకలు వేస్తూ వీధిలోకి పరుగుతీసి ప్రాణాలు రక్షించుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నార్త్ వియత్నాంలోని థై న్యూయెన్ ప్రొవిన్స్‌కు చెందిన 24 యేళ్ల యువకుడు, 23 యేళ్ళ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, కొద్దిరోజుల తర్వాత తన భర్తను మోసం చేస్తూ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. 
 
తన ప్లాన్‌లో భాగంగా, భార్యను శృంగారం చేయడానికి రెచ్చగొట్టాడు. ఆ తర్వాత ఆమె కామంతో రగిలిపోతున్న సమయంలో కోసిన పచ్చిమిర్చి ముక్కలను బలవంతంగా ఆమె మర్మాంగంలోకి చొప్పించాడు. అలా ఎంతో కర్కశంగా మానవత్వాన్ని మరిచి ఆమెకు నరకం చూపించాడు. అంతటితో ఆగని భర్త, తాను చేసిన పనికి తట్టుకోలేక విపరీతమైన మంట, బాధతో ఏడుస్తున్న తన భార్య భాధ పడుతున్న వీడియో తీస్తూ పైశాచికానందం పొందాడు. అయితే, ఆ యువతి మాత్రం బాధతో అరుస్తూ వీధిలోకి దౌడు తీసింది. ఆమెను గమనించిన పోలీసులు రక్షించారు. దీనిపై కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.