గురువారం, 7 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 ఆగస్టు 2025 (08:56 IST)

అప్పులు బాధ భరించలేక - ముగ్గురు కుమార్తెలను గొంతుకోసి హత్య.. తండ్రి ఆత్మహత్య

kids murder
అప్పుల బాధతో ఒక వ్యక్తి ముగ్గురు బాలికలను గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన నామక్కల్ జిల్లాలోని రాశిపురం సమీపంలోని వెప్పంగవుందన్ పుత్తూర్ గ్రామంలోలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన గోవిందరాజ్ (36) అనే వ్యక్తి సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ వ్యవసాయం కూడా చేస్తున్నాడు. అతని భార్య భారతి (26), కుమార్తెలు ప్రకృతిశ్రీ (10), రిత్తికశ్రీ (7), దేవిశ్రీ (6), కుమారుడు ఆగ్నెస్ వరన్ (1) ఉన్నారు.
 
ఈ పరిస్థితిలో, సోమవారం రాత్రి ముగ్గురు బాలికలు గోవిందరాజ్‌తో పడుకున్నారు. భారతి అగ్నేశ్వరన్‌తో కలిసి మరొక గదిలో పడుకుంది. మంగళవారం ఉదయం పిల్లల అరుపులు విని ఆమె భయపడి మేల్కొని గది నుండి బయటకు రావడానికి ప్రయత్నించింది. అయితే, గది తలుపు బయటి నుండి లాక్ చేసి వున్నాయి. ఆమె తలుపు పగలగొట్టి బయటకు వచ్చేసరికి, ముగ్గురు పిల్లలు గొంతులు కోసి హత్య చేసి కనిపించారు. వారి పక్కనే గోవిందరాజ్ నోటి నుండి నురగలు కారుతూ చనిపోయివున్నాడు. 
 
దీనిప సమాచారం అందుకున్న మంగళపురం పోలీసులు నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం నామక్కల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో రూ.20 లక్షల అప్పు చెల్లించలేకపోవడంతో నిరాశ చెందిన గోవిందరాజ్ బాలికలను చంపి, ఆపై విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది. ఈ ఘటనపై మంగళపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.