గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 జులై 2020 (10:10 IST)

కరోనాకు చుక్కలు చూపించాం.. ప్రజలపై కిమ్ జాంగ్ ప్రశంసలు

ప్రపంచ దేశాలను కరోనా ముప్పుతిప్పలు పెడుతోంది. కానీ ఉత్తర కొరియాలో మాత్రం కోవిడ్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. అక్కడ కరోనా సోకలేదని తెలుస్తోంది. ఇంక కరోనా కేసులు ఉత్తర కొరియాలో లేవని... ఆ దేశం ప్రకటిస్తూ వస్తోంది.

తాజాగా దీనిపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్పందిచారు. కరోనా తమ దేశాన్ని ఏమి చేయలేకపోయిందని అభిప్రాయపడ్డారు. ఇంకా నార్త్ కొరియా ప్రజలపై ఆయన ప్రశంసలు కురిపించినట్టుగా ఆ దేశ ప్రముఖ మీడియా కేసీఎన్ఏ పేర్కొంది.
 
కరోనా మహమ్మారి విషయంలో తమ ప్రజల పోరాటం అద్వితీయమని కిమ్ జాంగ్ ఉన్ కొనియాడారు. ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న వేళ, తన దేశాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయిందని ఆయన అన్నారు. దూర దృష్టితో ముందుగా సరిహద్దులను మూసివేయడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. జాతి భద్రత కోసమే వేలాది మందిని ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉంచానమన్నారు. జాతి యావత్తు స్వచ్ఛందంగా మహమ్మారిపై పోరాడిందని దేశ ప్రజలను అభినందించారని కేసీఎన్ఏ పేర్కొంది.