శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (17:32 IST)

కరోనా సూపర్ స్పైడర్ .. ఆఫీసుకెళ్లి ఏడుగురిని చంపేశాడు..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు మరింత కొత్తరూపాన్ని సంతరించుకుంది. ఇది గతంలో కంటే మరింత తీవ్రమైనదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కరోనా స్ట్రెయిన్ అని పేరు పెట్టారు. అయితే, ఈ కరోనా స్ట్రెయిన్ బారినపడితే ఇక కోలుకోవడం కష్టమని వైద్య నిపుణులు పదేపదే మొత్తుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో అమెరికాలో ఓ వ్యక్తి సూపర్ స్పైడర్‌గా మారాడు. తనకు కరోనా సోకిందని తెలిసి కూడా ఆఫీసుకెళ్లాడు. అక్కడ మరికొందరికి ఈ వైరస్ అంటించాడు. ఈ వైరస్ బారినపడిన వారిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 300 కుటుంబాలు క్వారంటైన్‌కు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
కరోనా మహమ్మరి వ్యాప్తితో దక్షిణ ఒరెజిన్ కమ్యూనిటీలో ఏడుగురు మృతిచెందగా, వైరస్ బారిన పడ్డామనే ఆందోళనలతో వందల కుటుంబాలు క్వారంటైన్‌లోకి వెళ్లాయి. అమెరికాలో సూపర్ స్ప్రెడర్ ఈవెంట్‌లను నిర్వహించి ఓ కమ్యూనిటీ మొత్తం కరోనా బారిన పడుతుంటుంది. 
 
ఇలాంటి ఈవెంట్లు మరణాలకు కారణమవుతుంటాయి. అయితే, ఒరెజిన్ కమ్యూనిటీ మాత్రం ఎలాంటి ఈవెంట్లు నిర్వహించలేదు. అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి ఆఫీస్‌కు వెళ్లడంతో సూపర్ స్ప్రెడర్‌కు కారణమైనట్లు ప్రజారోగ్యశాఖ అధికారులు తెలిపారు. 
 
తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిసి కూడా ఓ ఉద్యోగి విధులకు హాజరయ్యాడు. ఆ తర్వాత నిర్వహించిన టెస్టులో అతడికి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత ఒక్కో ఉద్యోగిని ట్రేస్ చేయగా, వందల కుటుంబాలు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తేలింది. 
 
ఈ వ్యాప్తితో ఏడుగురు ప్రాణాలను కోల్పోయారని, 300 కుటుంబాలు క్వారంటై‌న్‌లో ఉన్నట్లు డౌగ్లస్ కంట్రీ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం ఒరెజిన్ కమ్యూనిటీ ప్రజలు పడుతున్న బాధను మనం ఊహించలేమన్నారు.