బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (09:24 IST)

దేవుడి వ్యతిరేకులతో జరిగిన పోరులో ఐసీసీ చీఫ్ మృతి

isis
అంతర్జాతీయ స్థాయిలో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థగా గుర్తింపు పొందిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాన్ (ఐసిసి) చీఫ్ అబు హాసన్ అల్-హషిమి అల్ ఖురేషీ చనిపోయాడు. దేవుడు వ్యతిరేకశక్తులతో జరిగిన పోరులో ఆయన అశువులు బాసినట్టు ఐసిసి ఓ ఆడియో సందేశంలో తెలిపింది. ఇరాక్‌కు చెందిన హషిమి దేవుడు వ్యతిరేకలతో జరిగిన యుద్ధంలో మరణించారని ఐసిసి తెలిపింది. అయితే, ఎపుడు, ఎక్కడ మరణించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 
 
అదేసమయంలో ఖురేషీ హతం కావడంతో అతని స్థానంలో ఐసిసి కొత్త చీఫ్‌గా అల్ హుస్సేన్ అల్ హుస్సేని అల్ ఖురేషిని నియమించింది. ఐసిసి చీఫ్ హతమైనట్టు ఆడియో ద్వారా వెల్లడించిన వ్యక్తే కొత్త చీఫ్‌గా భావిస్తున్నారు. ఖురేషీ అనేది మహ్మద్ ప్రవక్త తెగను సూచిస్తుంది. 
 
ఐసీసీ చీఫ్‌గా వ్యవహరించిన అబు ఇబ్రహీం అల్ హషిమి అల్ ఖురేషీ అమెరికా బలగాల దాడి నుంచి తప్పించుకునేందుకు తనను తాను పేల్చుకున్నట్టు సమాచారం. గత ఫిబ్రవరి నెలలో సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో అమెరికా బలగాలు ఆయన ఉంటున్న ఇంటిని చుట్టుముట్టాయి. దీంతో మరోమార్గం లేక తనను తాను పేల్చేసుకున్నాడు.