శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (10:01 IST)

భారత మార్కెట్లోకి.. జియోనీ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ ధరెంతంటే?

Gionee Max
భారత మార్కెట్లోకి జియోనీ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. చైనా ఉత్పత్తులపై నిషేధం విధించాలనే డిమాండ్ పెరిగిపోతున్న తరుణంలో.. జియోని ఏడాది తర్వాత తన ఉత్పత్తులను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. జియోనీ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌తో కొత్త ఫోనును ఆవిష్కరించింది. బ్లాక్, రెడ్, రాయల్ బ్లూ మూడు రంగుల్లో లభించనుంది.
 
జియోనీ మాక్స్ 2 జీబీ ర్యామ్ +32 జిబి స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ. 5,999 మాక్స్ ఆగస్టు 31 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభ్యమవుతుంది. ప్రధానంగా బిగ్ బ్యాటరీ, ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఫీచర్లతో ఎంట్రీ లెవల్ ధర వద్ద జియోనీ మాక్స్ లాంచ్ అయింది. 
 
జియోనీ మాక్స్ ఫీచర్లు
ఆక్టా-కోర్ యునిసోక్ 9863ఏసాక్
13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
6.1అంగుళాల హెచ్‌డీ డిస్ ప్లే
720 x1560 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 10
2 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్
256 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం