మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2022 (15:05 IST)

చెన్నైకి చేరిన JioTrue5G-ఆధారిత Wi-Fi సేవలు.. అదనంగా Jio వెల్‌కమ్ ఆఫర్!

jio 5G
jio 5G
రిలయన్స్ జియో ప్రస్తుతం 5జీ సేవలపై దృష్టి సారించింది. 5జీ సేవలను దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో పడింది. ఇందులో భాగంగా ముందుగా విద్యా సంస్థలు, మత స్థలాలు, రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్‌లు, వాణిజ్య కేంద్రాలు, ఇంకా ఎక్కువ మంది ప్రయాణించే ప్రాంతాల్లో JioTrue5G-ఆధారిత Wi-Fi సేవలను ప్రవేశపెడుతున్నట్లు జియో శనివారం ప్రకటించింది. 
 
JioTrue5G సేవకు తోడుగా Jio వెల్‌కమ్ ఆఫర్ ఇటీవల ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలలో ప్రారంభించబడింది. అదనపు నగరాలకు ఈ సేవలను విస్తరించేందుకు True5G-రెడీ హ్యాండ్‌సెట్‌ల లభ్యతను పెంచడానికి Jio బృందాలు 24 గంటలు పని చేస్తున్నాయి.
 
ఇందులో శుభ్-ఆరంభ్‌గా, JioTrue5G సేవలతో పాటు, Jio శనివారం రాజస్థాన్‌లోని దేవాలయ పట్టణం నాథ్‌ద్వారాలో JioTrue5G-ఆధారిత Wi-Fi సేవలను ప్రారంభించింది. Jio వెల్‌కమ్ ఆఫర్ వ్యవధిలో Jio వినియోగదారులు ఎటువంటి ఛార్జీ లేకుండా ఈ సేవను పొందుతారు. 
 
దీనిపై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ ఆకాష్ ఎం అంబానీ మాట్లాడుతూ, "మానవత్వానికి సేవ చేయడం అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి. దీని మూలాలు మన సామాజిక-మత సంప్రదాయాలలో కనిపిస్తాయి.
 
ఇంతకు ముందు చెప్పినట్లుగా, 5G అనేది చాలా తక్కువ మంది లేదా మన అతిపెద్ద నగరాల్లో ఉన్న వారికి ప్రత్యేకమైన సేవగా ఉండకూడదు. ఇది భారతదేశం అంతటా ప్రతి పౌరుడికి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యాపారానికి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. 
 
ప్రతి భారతీయుడు JioTrue5Gని ఎనేబుల్ చేయడానికి ఇది ఆ దిశగా ఒక అడుగు. ఇందులో భాగంగా మేము పవిత్ర దేవాలయ పట్టణంలోని శ్రీనాథ్ జీ ఆలయంలో మొదటి True5G-ప్రారంభించబడిన Wi-Fi సేవను అందించాము. ఈ సేవలు త్వరలో అన్నీ ప్రాంతాలకు విస్తరిస్తాయి.  
 
అదనంగా, Jio True5G వెల్‌కమ్ ఆఫర్‌కి జోడించబడే మా తాజా నగరంగా చెన్నైని మేము స్వాగతిస్తున్నాము. ఇటీవలి లాంచ్ సమయంలో వాగ్దానం చేసినట్లుగా, JioTrue5G మరిన్ని నగరాల్లో విస్తరించబడుతుంది.. అన్నారు. ఇకపోతే.. చెన్నైలోని ఆహ్వానించబడిన Jio వినియోగదారులు 1 Gbps వరకు అపరిమిత 5G డేటాను యాక్సెస్ చేయవచ్చు.