సంబంధిత వార్తలు
- భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చినప్పుడు... ఆ సంబరాలకు దూరంగా గాంధీజీ ఏం చేస్తున్నారు?
- భారతదేశంలో స్వతంత్రం కోసం మొదటి పోరాటం ఎప్పుడు జరిగిందో తెలుసా?
- కోచ్ల రేసులో ఆ ఆరుగురు... రవిశాస్త్రికే పట్టమా?
- ఈజీగా 75-80 సెంచరీలు కొట్టేస్తాడు.. కోహ్లీపై ప్రశంసల వర్షం
- సన్నీ లియోన్ నెంబర్ వన్: మోదీ, ఖాన్లను వెనక్కి నెట్టేసింది..
జియోమీ ఏ3 మొబైల్ ఫోన్ వచ్చేస్తోంది.. అమేజాన్లో 21 నుంచి?
భారతదేశ మొబైల్ రంగంలో జియోమీ సంస్థ ముందుకు దూసుకుపోతోంది. తాజాగా షావోమీ సంస్థ ఫ్యాన్స్కు మరో గుడ్న్యూస్ చెప్పింది. జియోమీఆండ్రాయిడ్ వన్ సిరీస్లో మరో స్మార్ట్ఫోన్ ఇండియాకు రాబోతోంది. ఈ సంస్థ ఇప్పటికే ఈ సిరీస్లో ఎంఐ ఏ1, ఎంఐ ఏ2 స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది.
త్వరలో ఎంఐ ఏ3 స్మార్ట్ఫోన్ను ఇండియాకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎంఐ ఏ3 భారత్లో ఆగస్ట్ 23వ తేదీన రిలీజ్ కావచ్చునని ప్రచారం జరుగుతోంది. ఈ స్మార్ట్ఫోన్ గత నెలలో స్పెయిన్లో విడుదలైంది. ఈ స్మార్ట్ఫోన్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
జియోమీ ఏ3 ప్రత్యేకతలు:
* 6.1 ఇంచ్ల అమొలెడ్ డిస్ప్లే,
* 4జీబీ, 6జీబీ ర్యామ్,
* 64జీబీ, 128జీబీ ఇంటర్నెల్ స్టోరేజీ
* స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్
* 8 వాట్ ఛార్జర్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5
* 48+8+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
* 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* 4,030 ఎంఏహెచ్ బ్యాటరీ
* ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది
* కలర్స్: బ్లూ, వైట్, గ్రే
ధర:
4జీబీ+64జీబీ- సుమారు రూ.19,300
6జీబీ+128జీబీ-సుమారు రూ.21,600
