శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (15:45 IST)

రూ.5290కే శాంసంగ్ గెలాక్సీ ఎ2 కోర్ స్మార్ట్‌ఫోన్

మొబైల్ దిగ్గజ సంస్థ శాంసంగ్ కంపెనీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ2 కోర్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.5290 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రానుంది. ఇందులో ఆండ్రాయిడ్ పై గో ఎడిష‌న్ ఓఎస్‌ను అందిస్తున్నారు. 
 
శాంసంగ్ గెలాక్సీ ఎ2 కోర్ ప్రత్యేకతలు...
* 5 అంగుళాల డిస్‌ప్లే, 
* 540 x 960 పిక్స‌ెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
* 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7870 ప్రాసెసర్‌,
 
* 1 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 
* ఆండ్రాయిడ్ 9.0 పై (గో ఎడిష‌న్‌), డ్యుయ‌ల్ సిమ్‌, 
 
* 5 మెగాపిక్స‌ెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ెల్ సెల్ఫీ కెమెరా, 
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 2600 ఎంఏహెచ్ బ్యాట‌రీ కలదు.