1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2022 (13:50 IST)

సుందర్ పిచాయ్ పుట్టినరోజు.. తండ్రి ఏడాది జీతంతో యూఎస్ ఫ్లైట్ ఎక్కాడు...

sundar pichai
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ నేడు (జూన్ 10, 2022) 50వ ఏట అడుగుపెట్టారు. ప్రతినెలా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న టెక్ దిగ్గజం టాప్ బాస్, వినయవిధేయుడు అయిన సుందర్ పిచాయ్.. 2020లో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికాకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తాను ఎదుర్కొన్న సవాళ్లను వెల్లడించారు. 
 
అటువంటి ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ, స్టాన్ఫోర్డ్ హాజరు కావడానికి వీలుగా తన తండ్రి అమెరికాకు తన విమాన టికెట్ కోసం ఒక సంవత్సరం జీతానికి సమానమైన మొత్తాన్ని ఖర్చు చేశాడని చెప్పారు. ఇలా సుందర్ పిచాయ్ తండ్రి తన ఏడాది జీతాన్ని అమెరికా ఫ్లైట్ కోసం ఖర్చు పెట్టారు. ప్రస్తుతం అతను ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నారు. 
 
"నా తండ్రి ఒక సంవత్సరం జీతానికి సమానమైన వేతనాన్ని యుఎస్ కు నా విమాన టికెట్ కోసం ఖర్చు చేశాడు, తద్వారా నేను స్టాన్ ఫోర్డ్ కు హాజరు కాగలిగాను. విమానంలో ప్రయాణించడం అదే మొదటిసారి" అని యూట్యూబ్ స్ట్రీమ్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన మాటలు వింటున్న విద్యార్థులతో ఆయన అన్నారు. 
 
అతను దేశానికి వచ్చినప్పుడు అమెరికా ఎంత ఖరీదైనదో కూడా వివరించారు. "ఒక ఫోన్ కాల్ నిమిషానికి 2 డాలర్ల కంటే ఎక్కువ. ఇది భారతదేశంలో మా నాన్న నెలవారీ జీతంతో సమానంగా ఖర్చు అవుతుంది" అని ఆయన వివరించారు.
 
కానీ అతనికి త్వరలోనే అదృష్టం తలుపుతట్టింది. ప్రస్తుతం, సుందర్ పిచాయ్ టెక్ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే CEOలలో ఒకరిగా అవతరించారు. మీడియా నివేదికల ప్రకారం, అతను 2015 మరియు 2020 మధ్య సుమారు 1 బిలియన్ డాలర్లు సంపాదించారు, ఇందులో బోనస్లు, గ్రాంట్లు ఉన్నాయి. 
 
లైవ్ స్ట్రీమ్ కార్యక్రమంలో, పిచాయ్ "అన్ని ఆకారాలు, పరిమాణాల కంప్యూటర్లు" కలిగి ఉన్న నేటి పిల్లలతో పోలిస్తే తన బాల్యం ఎంత భిన్నంగా ఉందో కూడా చెప్పారు. తాను "సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేకుండా పెరిగాను" అని ఆయన అన్నారు. 
 
నాకు పది సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మాకు మా మొదటి టెలిఫోన్ రాలేదు. నేను గ్రాడ్యుయేట్ పాఠశాల కోసం అమెరికా వచ్చే వరకు నాకు కంప్యూటర్ అందలేదు. టెలివిజన్‌లో ఒక ఛానెల్ మాత్రమే ఉంది" అని పిచాయ్ చెప్పారు.