సంబంధిత వార్తలు
- ట్విటర్కు పోటీగా బ్లూ స్కై : జాక్ డోర్సే సరికొత్త యాప్
- ట్విటర్ నుంచి ఉద్వాసనకు గురైన పరాగ్ అగర్వాల్కు రూ.344 కోట్ల పరిహారం
- మిలియన్ల ఫాలోవర్స్లో మహేష్బాబు రికార్డ్!
- ఎలాన్ మస్క్ ట్విటర్ టేకోవర్ పూర్తి, తెలుగు ఉద్యోగి విజయ గద్దె, సీఈఓ పరాగ్ అగర్వాల్ తొలగింపు
- 'ట్విటర్' పక్షికి విముక్తి లభించింది : ఎలాన్ మస్క్
ట్విట్టర్లో భారీ మార్పులు.. ఆదివారం ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్
ట్విట్టర్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియను మార్చుతున్నట్టు ఆ సంస్థ కొత్త అధిపతి ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం తెలిపారు.
మైక్రో మెసేజ్ సైట్ను ఎలాన్ మస్క్ ఇటీవల కొనుగోలు చేసిన విషయంతెల్సిందే. ఆ తర్వాత ట్విట్టర్లో పెను మార్పులకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే ట్విటర్లో పని చేస్తూ వచ్చిన టాప్ ఎగ్జిక్యూటివ్స్ను తప్పించారు. ఇపుడు ట్విటర్లో మార్పులు చేర్పులు చేయనున్నారు.
ముఖ్యంగా, బ్లూ చెక్ మార్క్ కోసం ఇప్పటివరకు చేస్తున్న వెరిఫికేషన్ ప్రక్రియలో సమూల మార్పులు తీసుకుని రానున్నట్టు తెలిపారు. ఇందులోభాగంగా, బ్లూ చెక్ మార్క్ కావాలనుకునే యూజర్లు ఇప్పటివరకు నెలకు రూ.410 చెల్లిస్తూ వచ్చారు. ఇకపై దీన్ని రూ.1650కు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
తర్వాతి కథనం
