ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం : పది మంది మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాయ్పూర్ - బలోద బజార్ మార్గంలో సోమవారం వేకువజామున జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం 13 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రయాణికులతో వెళుతున్న వాహనాన్ని అతివేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృత్తుల్లో తొమ్మిది మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్టు రాయ్పూర్ ఎస్పీ లాల్ ఉమ్మెద్ సింగ్ తెలిపారు.
బాధితులు ఓ వివాహ వేడుకకు హాజరై చౌతియా ఛత్తీ నుంచి రాయ్పూర్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.