1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (12:39 IST)

జమ్మూ-కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత: ముగ్గురు హతం

జమ్మూ-కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గత రెండు వారాల నుంచి జమ్మూ కాశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లల్లో దాదాపు 8 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కాశ్మీర్ పోలీసులు తెలిపారు. 
 
తాజాగా ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. బుడ్గాం పరిధిలోని జోల్వా క్రాల్పోరా ఛదూరా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వారినుంచి 3 ఏకే 47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
 
ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గురువారం రాత్రినుంచి స్థానిక పోలీసులు, బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.