శనివారం, 5 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (13:37 IST)

కేరళలో చేయి ఫ్రాక్చర్‌తో చికిత్స పొందుతూ బాలుడి మృతి

kids
కేరళలో చేయి ఫ్రాక్చర్‌తో చికిత్స పొందుతూ ఐదేళ్ల బాలుడు మృతి చెందాడని, ప్రైవేట్ ఆసుపత్రిని కుటుంబ సభ్యులు నిందించారు. పాతనంతిట్ట (కేరళ)లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఐదేళ్ల బాలుడు మత్తుమందు ఇవ్వడం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబీకులు ఆరోపించారు. అతడి చేతికి ఫ్రాక్చర్ కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
 
తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పాఠశాలలో ఆడుకుంటూ బాలుడు పడిపోయాడు. ఫ్రాక్చర్ అయిన చేతిని సరిగ్గా అమర్చడానికి అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. 
 
"ఇది ఒక చిన్న డిస్‌లోకేషన్ మాత్రమే, కానీ మత్తుమందు ఇవ్వడం ద్వారా చేయి అమర్చవచ్చు అని ఆసుపత్రి అధికారులు చెప్పారు. కానీ మా బిడ్డ మరణించాడని.. బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.