1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 మే 2020 (10:09 IST)

కట్టుకున్న భర్త వుండగా ప్రియుడు అవసరమా?

కట్టుకున్న భర్త వుండగా ప్రియుడు అవసరమా అంటూ.. ఓ సోదరుడు తన చెల్లెలను హత్య చేసిన ఘటన తమిళనాడు మధురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధురై, కీళప్పట్టి ప్రాంతానికి చెందిన మోహన్‌కు శకుంతలతో వివాహమైంది. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల బాబు, ఏడేళ్ల కుమార్తె వుంది. 
 
కానీ ఈ దంపతులు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. దీంతో శకుంతల పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో శకుంతల సోదరుడు సౌందరపాండియన్ ఇంటి వద్ద వసించే ఓ వ్యక్తితో శకుంతలకు వివాహేతర సంబంధం నెలకొంది. ఈ విషయం శకుంతల సోదరుడికి తెలియరావడంతో ఆమెను మందలించాడు. 
 
అయినా శకుంతలలో మార్పు రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సౌందరపాండియన్.. శకుంతలతో గొడవకు దిగాడు. ఆపై కత్తితో ఆమెను నరికి చంపేశాడు. ఈ ఘటనలో శకుంత ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న సౌందరపాండియన్‌ కోసం గాలిస్తున్నారు.