1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 జూన్ 2025 (14:50 IST)

చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్ (Video)

plane crash
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఘోరం జరిగింది. అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఎయిరిండియా విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే క్రమంలో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టును ఢీకొట్టి విమానం కూలిపోయినట్టు ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది.