మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (12:39 IST)

విందుకు ఆహ్వానించిన ఫ్రెండ్ .. అతని భార్యపై అత్యాచారం చేసిన ఆర్మీ కల్నల్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన ఇంటికి విందుకు ఆహ్వానించిన స్నేహితుడి భార్యపై ఆర్మీ కల్నల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కాన్పూర్‌లోని కంటోన్మెంట్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ ఆర్మీ ఉద్యోగికి లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ నుంచి క‌ల్న‌ల్‌గా ప‌దోన్న‌తి ల‌భించింది. దీంతో త‌న స్నేహితుడితో పాటు అత‌ని భార్య‌ను ఆర్మీ ఉద్యోగి విందుకు ఆహ్వానించాడు. దీంతో భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ క‌లిసి విందుకు వెళ్లారు. 
 
అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత ఇద్ద‌రికీ మ‌త్తు కలిపిన పానీయాలను ఆర్మీ ఉద్యోగి ఇచ్చాడు. ఆ త‌ర్వాత స్నేహితుడి భార్య‌పై ఆర్మీ క‌ల్న‌ల్ అత్యాచారం చేశాడు. త‌మ‌కు జ‌రిగిన ఘోర అవ‌మానంపై బాధితురాలి భ‌ర్త కంటోన్మెంట్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. 
 
కేసు న‌మోదు చేసుకున్న పోలీసుల‌కు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆర్మీ క‌ల్న‌ల్ ఆచూకీ కోసం గాలిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ర‌ష్య‌న్ సంత‌తికి చెందిన మ‌హిళ‌.