1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 28 ఆగస్టు 2014 (14:52 IST)

జగత్తు ఉన్నంతకాలం మహిళలపై అత్యాచారాలు : తృణమూల్ ఎంపీ

ఈ జగత్తు ఉన్నంతకాలం మహిళలపై అత్యాచారాలు, అరాచకాలు జరుగుతూనే ఉంటాయని వెస్ట్ బెంగాల్ అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్ వ్యాఖ్యానించారు. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. 
 
ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీపక్ హల్దార్‌పై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పలువురు తృణమూల్ నేతలు కూడా ఇదే విధంగా వ్యాఖ్యానికి చిక్కుల్లో పడిన విషయం తెల్సిందే. 
 
గతంలో ఆ పార్టీకి చెందిన ఎంపీ తపస్ పాల్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చిక్కుల్లో పడ్డారు. ఈయనగారు.. సీపీఎం కార్యకర్తలు, నేతలు తమ పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకున్నట్టయితే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో మీ (సీపీఎం) మహిళలను అత్యాచారం చేయిస్తానంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెల్సిందే.