మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 10 జులై 2018 (17:37 IST)

స్వలింగ సంపర్కులపై స్వామి ఏమన్నారు..? బీజేపీ అది అచ్చి రాదట..!

స్వలింగ సంపర్కులను క్రిమినల్స్‌గా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377పై మరోసారి వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం సిద్ధమైన తరుణంలో స్వలింగ సంపర్కంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. ఏడుగురు ల

స్వలింగ సంపర్కులను క్రిమినల్స్‌గా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377పై మరోసారి వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం సిద్ధమైన తరుణంలో స్వలింగ సంపర్కంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. ఏడుగురు లేదా తొమ్మిది మందితో కూడిన విస్తృత ధర్మాసనం ఈ పిటిషన్‌కు సంబంధించిన వాదనలను వింటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
స్వలింగ సంపర్కం సహజమైన ప్రక్రియ కాదని, హిందుత్వానికి ఇది పూర్తిగా వ్యతిరేకమని స్వామి వ్యాఖ్యానించారు. .. స్వలింగ సంపర్కం నుంచి జనాలు బయటపడేందుకు మెడికల్ రీసర్చ్ ద్వారా మార్గాలు వెతకాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్వలింగ సంపర్కులను చూసి ఆనందించడం కానీ, వారికి మద్దతు పలకడం కానీ సరైన చర్య కాదన్నారు.
 
మరోవైపు బీజేపీని అధికారంలోకి తెచ్చేది హిందుత్వ అజెండానేనని సుబ్రహ్మస్వామి తెలిపారు. మాజీ ప్రధాని వాజ్ పేయి హయాంలో 'ఇండియా షైనింగ్' నినాదంతో ఎన్నికల బరిలోకి బీజేపీ దిగిందని.. కానీ, ఓటమిపాలైందని గుర్తుచేశారు. అలాగే బీజేపీకి అభివృద్ధి నినాదం పని చేయదని తెలిపారు. గత ఎన్నికల్లో హిందుత్వ స్థాపన, అవినీతి రహిత ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంతో బీజేపీ ఎక్కువ సీట్లను సాధించిందని చెప్పారు. 
 
బీజేపీకి మరో ఐదేళ్ల పాటు అధికారాన్ని ఇస్తే తన ఎన్నికల వాగ్ధానాన్ని నెరవేరుస్తుందని స్వామి చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లో హిందూ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పారు. ఒకవేళ పీడీఎఫ్‌లో హిందువు కానీ, సిక్కు కానీ ఉంటే... వారినే సీఎం చేయాలని సూచించారు.