గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (10:54 IST)

బెంగళూరులో శవమైన హైదరాబాద్ మహిళ.. కారణం అతడే?

crime scene
హైదరాబాద్ మహిళ బెంగళూరులో శవమై కనిపించింది. ఈ ఘటనపై మృతురాలి మాజీ భాగస్వామిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కోడిహళ్లిలో హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల మహిళను ఆమె మాజీ భాగస్వామి హత్య చేశాడు. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల బైజు ఉద్యోగి గురిజాల అర్పిత్‌గా పోలీసులు అతడిని గుర్తించారు. 
 
జూన్ 5, సోమవారం, ఆమె రూమ్‌మేట్ లేని సమయంలో బాధితురాలిని ఆమె అపార్ట్‌మెంట్‌లో గొంతు కోసి చంపాడు. బాధితురాలు ఆకాంక్ష బిద్యాసర్ మాజీ బైజు ఉద్యోగి. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో కలిసి పనిచేసిన అర్పిత్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా సహజీవనం చేసేంతవరకు వచ్చింది. అయితే వీరిద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయి.

ఈ విబేధాలతో వాడు విడిపోయారు. ఇక 2022లో బైజూస్ బెంగళూరు బ్రాంచ్‌కి వెళ్లడానికి ముందు అర్పిత్ ఈ కాలంలో ఆకాంక్షకు మేనేజర్‌గా ఉన్నారు. ఆపై కంపెనీ మారడంతో కొన్ని వస్తువులు ఆకాంక్ష వద్ద వుండటంతో వాటిని పట్టుకెళ్లేందుకు వచ్చాడు. అలా వచ్చిన అర్పిత్.. ఆకాంక్షను గొంతుకోసి హత్య చేశాడు. ఆకాంక్ష రూమ్‌మేట్ సాయంత్రం 6:15 గంటలకు ఇంటికి చేరుకుని, ఆమె గదిలో నేలపై కదలకుండా పడి వుండటం చూసి పోలీసులకు సమాచారం అందించింది. 
 
ఆకాంక్ష తల్లి మంగళవారం జీవన్‌భీమానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతకుముందు రోజు తన కుమార్తె నివాసాన్ని సందర్శించినప్పుడు, కాఫీ టేబుల్‌పై అర్పిత్ వాలెట్, బ్యాగ్, టిష్యూ పేపర్‌ని ఆమె కనుగొంది. 
 
సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే, అర్పిత్ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి ఒంటరిగా బయలుదేరినట్లు పోలీసులు గుర్తించగలిగారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతేగాకుండా నిందితులు అతనిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) 1860 కింద సెక్షన్ 201, సెక్షన్ 302 (హత్యకు శిక్ష) కింద కేసు నమోదు చేశారు.