శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (13:03 IST)

కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ: గులాంనబీ ఆజాద్

కాశ్మీర్‌లో ముగ్గురు ప్రముఖ రాజకీయనేతలను గృహ నిర్బంధంలో ఉంచడం, శ్రీనగర్‌లో 144 సెక్షన్ అమల్లోకి తేవడంతో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నిప్పులు చెరిగారు. కాశ్మీర్‌లో బీజేపీ ఏంచేయదలచుకుంటోంది? అని ప్రశ్నించారు. 
 
సోమవారంనాడు పార్లమెంటు వద్ద ఆజాద్ మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. పార్లమెంటులో కాశ్మీర్‌ అంశాన్ని తమ పార్టీ ఇవాళ లేవెనత్తుతుందని, ప్రధాని మోదీ నుంచి వివరణ కోరుతామని చెప్పారు.
 
కాగా.. కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేస్తూ.. రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు‌. 35ఎ కూడా రద్దుకు కూడా అమిత్ షా ప్రకటన చేశారు. 370 రద్దుతో కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోనుంది. 35ఏ రద్దుతో కాశ్మీర్ ప్రత్యేక సౌకర్యాలను కోల్పోనుంది.