శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 4 ఆగస్టు 2019 (11:12 IST)

ధ్వంసం చేయడమే బీజేపీకి తెలుసు : రాహుల్

భారతీయ జనతా పార్టీకి ధ్వంసం చేయడమే తెలుసని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వానికి కూల్చడమే తెలుసన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అనుకున్నంత వేగంగా లేదన్న వార్తలతో రాహుల్ గాంధీ శనివారం ఓ ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి కూల్చడమే కానీ కొత్తగా దేనినీ నిర్మించే సత్తా లేదని ఆరోపించారు. 'బీజేపీ ప్రభుత్వం దేనినీ నిర్మించలేదు. దశాబ్దాల తపన, విశేష కృషితో నిర్మించిన కట్టడాలను కూల్చడం మాత్రమే చేయగలదు' అని రాహుల్ ట్వీట్ చేశారు.
 
"బీజేపీ సర్కారుకు నిలబెట్టడం తెలియదు. తెలిసిందల్లా ధ్వంసమే. దశాబ్దాలుగా కష్టపడి, మక్కువతో నిర్మించుకున్న వాటిని కూలగొట్టడం ఒక్కటే ఆ పార్టీకి తెలుసు. ఆర్థిక మాంద్యంతో పాటు ఆటో, బ్యాంకింగ్‌, రియల్‌ ఎస్టేట్‌, తయారీ రంగాలు కుదేలు కావడం బీజేపీ పనితీరుకు నిదర్శనాలు" అని వ్యాఖ్యానించారు.