1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 మే 2021 (21:51 IST)

రాజస్థాన్‌‌లో బ్లాక్ ఫంగస్.. అంటువ్యాధి అంటూ ప్రకటన

oxygen
కరోనా నుంచి కోలుకున్న వారిని ఇప్పుడు బ్లాక్ ఫంగస్ భయపెడుతుంది. ఈ బ్లాక్ ఫంగస్ రాజస్థాన్‌పై పంజా విసురుతోంది. ఇప్పటి వరకు అక్కడ 100కుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారినపడిన వారికి చికిత్స అందించేందుకు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు కేటాయించారు. 
 
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్లాక్‌ఫంగస్‌ను అంటువ్యాధిగా గుర్తిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం-2020 కింద దీనిని గుర్తించదగిన వ్యాధుల్లో చేర్చినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా తెలిపారు. 
 
బ్లాక్‌ ఫంగస్, కరోనాలకు సమగ్రమైన, సమన్వయంతో కూడిన చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.