1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2023 (18:40 IST)

ప్రధానితో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క..

Revanth Reddy
Revanth Reddy
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టివిక్రమార్క మల్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రితో చర్చించడం జరిగింది. 
 
రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరిన నేపథ్యంలో ప్రధాని గారు సానుకూలంగా స్పందించారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. 
 
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు సహా వివిధ అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎం... ప్రధానికి ఓ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులపై వారు చర్చించారు.