బొగ్గు స్కామ్.. మన్మోహన్పై నేరాభియోగాలు మోపలేం: సుప్రీం
దేశంలో సంచలనం సృష్టించిన బొగ్గు స్కామ్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై నేరాభియోగాలు మోపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఊరట లభించినట్లైంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్ను శుక్రవారం సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.
బొగ్గు గనుల అక్రమ కేటాయింపుల్లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు నాటి కేంద్ర మంత్రులు శిబూ సోరెన్, శ్రీ ప్రకాశ్ జైస్వాల్లపై నేరాభియోగాలు నమోదు చేయాలని న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
బొగ్గు కుంభకోణం వెలుగు చూసేందుకు కూడా ఎంఎల్ వర్మ పిటిషనే కారణం. మన్మోహన్ తదితరులపై అభియోగాలు మోపాలన్న పిటిషన్ను శుక్రవారం పరిశీలించిన సుప్రీంకోర్టు పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది.