బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు
బెంగళూరులోని శ్రీరాంపుర రైల్వే ట్రాక్ సమీపంలో పట్టపగలు హత్య జరిగింది. విద్యార్థినిని ఓ యువకుడు హత్య చేశాడు. మృతురాలిని యామిని ప్రియగా గుర్తించారు. ఆమె హోసకేరెహళ్లి ప్రాంతంలోని ఒక కళాశాలలో బి.ఫార్మ్ చదువుతోంది. ఆమె ఉదయం 7 గంటల ప్రాంతంలో పరీక్ష కోసం ఇంటి నుండి బయలుదేరి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది.
మంత్రి మాల్ ప్రాంతం సమీపంలో ఆమె నడుచుకుంటూ వెళుతుండగా, ఒక యువకుడు వెనుక నుండి ఆమె వద్దకు వచ్చి గొంతు కోసి, అక్కడి నుండి పారిపోయాడని తెలుస్తోంది. ఈ దారుణ సంఘటనను చూసిన స్థానికులు వెంటనే శ్రీరాంపుర పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, తనిఖీలు నిర్వహించి, ఆధారాలు సేకరించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.